ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆదిపురుష్" టీం పై డార్లింగ్ అభిమానుల నిరాశ

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 04:23 PM

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్టుల నుండి ఆయా మూవీ టీమ్స్ అప్డేట్లు ఇవ్వట్లేదని ఫ్యాన్స్ ఎప్పటినుండో కంప్లైంట్ చేస్తున్నారు. రాధేశ్యామ్ డిజాస్టర్ తో ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలపై తద్వారా ఆయా సినిమాల డైరెక్టర్లపై అభిమానుల ఒత్తిడి మరింత పెరుగుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని చిత్రబృందాన్ని నిందిస్తూ, డార్లింగ్ అభిమాని ఒకతను సూసైడ్ లెటర్ కూడా రాసాడు. సలార్, ప్రాజెక్ట్ కే లనుండి అప్డేట్లను కోరుతూ ఫాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్న తరుణంలో ఒక అభిమాన బృందం తాజాగా ఆదిపురుష్ మూవీ నుండి అప్డేట్లనిమ్మని కోరుతుంది. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం చాలా సమయాన్ని తీసుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ మూవీ దిగనుంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు టైటిల్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. సలార్ కంటే ముందే ఈ చిత్రాన్ని ప్రారంభించినా ఆదిపురుష్ చిత్రబృందం నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. #WakeupteamAdipurush అంటూ  సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఏదైనా ఒక్క అప్డేట్ అయినా ఇవ్వాలంటూ దర్శకుడు ఓం రౌత్ కు ట్యాగ్ చేస్తూ చేస్తున్నారు. 


రూ.500 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. విలన్ రోల్ లో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com