ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీతో పోలికే లేదని కేసీఆర్ అనడం బాధ కలిగించింది : సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 10:47 AM

అమరావతి : విభజనలో జరిగిన అన్యాయం వల్లనే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీతో పోలికే లేదనడం బాధకలిగించిందన్నారు. విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆ విషయంలో రాజీ పడే ప్రశక్తేలేదు…అవసరమైతే కోర్టుకు వెళతామని చంద్రబాబు చెప్పారు.  రాష్ట్రంలో తలసరి ఆదాయం మరో 35 వేల రూపాయలు పెరిగితేనే ఇతర రాష్ట్రాలతో సమానం అవుతామని అన్నారు.  దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, దీనికి కారణం ప్రజలు కాదు…యూపీఏ చేసిన అన్యాయమని చంద్రబాబు చెప్పారు. పొరుగు రాష్ట్రాల కన్నా 20 నుంచి 25 శాతం వెనుకబడి ఉన్నామన్నారు. విభజన గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com