ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదే మోడీ నన్న అడిగారు...చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 09:42 PM

మనం కలిసి చాలా రోజులైంది.. ఢిల్లీ రావడం లేదా అని ప్రధాని నరేంద్ర మోడీ తనను అడిగారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో మాట కలిపిన సంగతి తెలిసిందే. గత శనివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చర్‌ సెంటర్‌‌లో జరిగిన ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ నేషనల్ కమిటీ’ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబును మోదీ పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. ఈ వీడియో, ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రధాని, చంద్రబాబు మధ్య సంభాషణపై అందరూ చర్చించుకున్నారు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారనే చర్చ జరిగింది.


డిల్లీలో తాను ప్రధాని మోదీతో ఏం చర్చించాననే అంశంపై చంద్రబాబు మంగళవారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో వివరించారట. ఆన్‌లైన్‌లో జరిగిన సమావేశంలో ఢిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తాను వేరే వారితో మాట్లాడుతున్నాని.. ప్రధాని ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే వద్దకు వచ్చారని చెప్పుకొచ్చారట. 'మనం కలిసి చాలా రోజులైంది.. ఢిల్లీ రావడం లేదా అని' అడిగారట. ఢిల్లీలో తనకు పనేమీ లేదని.. రావడం లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారట.


'మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి.. మనం ఒకసారి కలవాలని' చంద్రబాబుతో అన్నారట. తాను కూడా 'మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని' చెప్పారట. 'ఒకసారి వీలు చూసుకుని ఢిల్లీ రండి.. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే.. నాకు అనువుగా ఉన్న సమయం చెబుతాను' అననారట. వద్దురు గాని తాను కూడా ఓకే చెప్పినట్లు చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారట. అంతేకాదు ఆరోగ్యం, కుటుంబం విషయాలపైనా మాట్లాడుకున్నట్లు చెప్పుకొచ్చారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com