ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం...సర్వం సిద్దంచేస్తున్న అధికార యంత్రాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 09:43 PM

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వేడుకలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు శకటాల ప్రదర్శన, పోలీసు కవాతు కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొనే ఈ వేడుకల కోసం అధికార బృందం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.


సీఎం జగన్, జడ్జిలు, మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లలో లోపాలు లేకుండా నిర్వహణ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 15 శకటాల ప్రదర్శనతో పాటు 10 బృందాలు వేడుకల్లో కవాతు చేస్తారని ఆయన చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని.. సెక్యూరిటీ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. సీఎం టూర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం అంతా జరుగుతుందని తలశిల రఘురామ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com