గుజరాత్లో శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. గుజరాత్లోని 93 నియోజకవర్గాల్లో 182 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 93 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా మొత్తం 851 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.22 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 18న ఓట్లను లెక్కించనున్నారు.