విజయవాడలో సీప్లేన్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అమరావతి నుంచి అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రకాశం బ్యారేజీని పర్యాటకంగా అభివృద్ది చేస్తామన్నారు. ఇన్ లాండ్ వాటర్ వేస్ ను అభివృద్ది చేస్తామన్నారు. ప్రపంచంలో టూరిజానికి చాలా ప్రాధాన్యత వచ్చిందన్నారు. టూరిజం అభివృద్ది కావాలంటే ఇన్ఫ్రా స్టక్చర్ భాగుండాలన్నారు. టూరిజం మనకు చాలా ముఖ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ కల్పిస్తామని సీఎం అన్నారు. ఎయిర్ పోర్టులు నిర్మించే అవకాశం లేని చోట సీప్లేన్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. కేంద్రం లో ఎయిర్ కనెక్టివిటీలు రావాలన్నారు. ఆ తర్వాత రాష్ట్రాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీలు వస్తాయన్నారు.