శ్రీవారి మెట్టు సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో తారసపడ్డ ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్మగ్లర్ల రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఘటన స్థలం నుంచి 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.