భువనేశ్వర్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి జనం దేహశుద్ధి చేసిన ఘటన ఒడిశాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.మయూర్ భంజ్ లోని ఒక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఆ పాఠశాల ప్రధానోపాథ్యాయుడు గత నెల రోజులుగా లైంగిక అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం బయటపడటంతో జనం అతడికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.