ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బుధవారం ఏపీ సచివాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ అథారటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు దర్శకుడు రాజమౌళితోపాటు రాష్ట్ర మంత్రి నారాయణ, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులు విచ్చేశారు. కాగా... అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, ఆయా విభాగాల డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది.