శ్రీనగర్ : కాశ్మీర్లో ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతుందని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పొరుగు దేశం ఉగ్రవాద సంస్థల పట్ల ఏ విధంగా స్పందిస్తుందనే విషయం తమకు అనవసరమని అయితే ఈ అంశాన్ని మాత్రం తాము ప్రస్తావిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. ఎల్ఇటి వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటామని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ పేర్కొనడంపై జనరల్ బిపిన్ రావత్ పైవిధంగా స్పందించారు. కాశ్మీర్లో సైనిక చర్యలు కొనసాగుతాయని, అక్కడ పరిస్థితిని మెరుగుపరచడానికి తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.