న్యూఢిల్లీ : భారత్లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని, ఉప రాష్ట్రపతి, ఇతర బీజేపీ కీలక నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్తో పాటు సముద్ర తీర ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.