చిత్తూరు: శాంతిపురం మండలం కడపల్లి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు మండల సచివాలయం ముందు నిరసనకు దిగారు. విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న ఆధారలు ఉన్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని ఎంపీపీ జడ్పిటిసిలకు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.