ఆధార్ కార్డు, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. అయినా కొంతమంది ఆధార్, పాన్ కార్డులను ఇంకా లింక్ చేసుకోలేదు. ముఖ్యంగా ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరు పాన్, ఆధార్ ను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని ప్రకటించింది.
కరోనా వల్ల ఆధార్, పాన్ లింక్ గడువు తేదీని ఈ ఏడాది మార్చి 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పొడిగించింది. ఈసారి మాత్రం ఇక గడువును పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్ను లింక్ చేసుకోని వాళ్లకు రూ.10 వేల ఫైన్ను విధిస్తామని సీబీడీటీ హెచ్చరించింది. డుప్లికేట్ పాన్ కార్డులను ఏరిపారేయడం కోసమే పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోండిలా..
- ముందుగా www.incometaxindiaefiling.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లండి.
- అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పూర్తి పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయండి.
= క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లింక్ ఆధార్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చాలు 10 రోజుల్లో ఆధార్, పాన్ కార్డు లింకింగ్ పూర్తవుతుంది.