ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినియోగదారులకు షాక్‌.. దేశంలో మళ్లీ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 12:00 PM

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి. ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. ఇప్పుడు ఢిల్లీ, ముంబైలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.949.50కు పెరిగింది. కోల్‌కతాలో వినియోగదారుడు సిలిండరుకు రూ.976 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెంచారు. పాట్నాలో ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ.1,039.50కి విక్రయిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com