ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్బీఐ కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 11:57 AM

నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. బ్యాంకులకు జరిమానా విధించడం, లైసెన్స్‌ రద్దు చేయడం లాంటివి చేస్తుంటుంది. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ సోమవారం రద్దు చేసింది. ఆర్బీఐ ఉత్తర్వు ప్రకారం.. పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్ (UP) ( పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్పూర్ ) లైసెన్స్ రద్దు చేసింది. యూపీ కోఆపరేటివ్ కమీషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా బ్యాంక్ మూసివేతకు ఉత్తర్వు జారీ చేయవలసిందిగా తెలిపింది. బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా ఆదేశించింది. సహకార బ్యాంకు డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లించడానికి వీలులేదని, దానిని కొనసాగించడానికి అనుమతిస్తే ప్రజల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించకుండా నిషేధించబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com