సుంకర వెంకట ఆదినారాయణరావు (జననం.జూన్ 30 1939) భారతీయ ఎముకల వైద్యులు. ఆయన పేదలకు సేవలందించే వైద్య వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. సామాజిక న్యాయం,సామాజిక బాధ్యత మరియు సమాజ సేవ ఆశయాలుగా పెట్టుకున్న వ్యక్తి . ఆయన గురువు ప్రొఫెసర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు. ఆయన దేశంలో వివిధ ప్రాంతాలలో ఆదినారాయణ గారు జరిపే నేత్ర వైద్య శిబిరాలకు సహకారం అందిస్తుంటారు. ఐతే తాజాగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ సుంకర ఆదినారాయణరావు . పోలియో నిర్మూలనకు ఆయన చేస్తున్న కృషి అమోఘం. ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన లక్షల మందికి పోలియో ఆపరేషన్లు నిర్వహించారు.