విశాఖపట్నం: డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సోమవారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఆకాశం మేఘావృతమై ఆకస్మికంగా వర్షంతో పాటు పెనుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వరద నీరు రహదారిపై ప్రవహించి పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణంలో మార్పులు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా గాలివానకు మామిడి జీడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.