ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక ధరలకు పామాయిల్ అమ్మితే కేసులే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 11:54 AM

విశాఖపట్నం: నక్కపల్లిలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వంట నూనెలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై సోమవారం విజిలెన్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు జరిపింది. విజిలెన్స్ సీఐ కోటేశ్వరరావు, లీగల మెట్రాలజీ విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ రంగారెడ్డి నేతృత్వంలోని బృందం నక్కపల్లిలో తనిఖీలు నిర్వహించగా ఎమ్మార్సీ కంటే అధిక ధరలకు వంట నూనెలను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విజిలెన్స్ సీఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ అధికధరలకు వంటనూనెలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.


ఈ మేరకు నక్కపల్లిలో భగవాన్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, శ్రీసత్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్పై లీగల్ మెట్రాలజీ కేసులు నమోదు చేశామని విజిలెన్స్ సీఐ చెప్పారు. ఎవరైనా అధిక ధరలకు వంటనూనెలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com