వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు ఏడాదికి రూ. 16, 500కోట్లకు పెరిగినట్లు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యంపై 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేదని తెలిపారు. కిక్ ఇవ్వడం కోసం మద్యంలో రసాయనాలు కలుపుతున్నారని దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని మండిపడ్డారు.