గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయని మానవ హక్కుల పరిరక్షణ నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు అనేక రకాలుగా చనిపోతూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనికి కారణం పాఠశాలనందు విద్యార్థుల బాగోగులు సరిగా చూసుకోక పోవడం వలన ఇలా జరుగుతుందని అన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.