స్వగ్రామానికి అని బయలుదేరిన మహిళా కనిపించకుండా పోయిన సంఘటన మండల పరిధిలోని బోయపాలెం వద్ద ఉన్న పార్వతీపురం లో జరిగింది. ప్రత్తిపాడు పోలీసుల కథనం ప్రకారం వెల్దుర్తి మండలం బొందల వీడు గ్రామానికి చెందిన అద్దలపూడి ప్రమీల (40) కొన్ని రోజులుగా గా పార్వతీపురం లోని తన సోదరుని ఇంట్లో ఉంటుంది. ఈ నెల 2వ తేదీన తన స్వగ్రామానికి వెళ్తున్నట్లు చెప్పి పార్వతీపురం నుంచి వెళ్లిన ఆమె స్వగ్రామానికి చేరలేదు. వెతకగా ఆచూకీ తెలియకపోవడంతో ఆమె కుమారుడు అద్దలపూడి తేజ పత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ మంగళగిరి డేవిడ్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.