ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్దేశిత గడువులో సమస్యలకు పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 08:49 AM

స్పందన కార్యక్రమం లో మొత్తం 44 ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్ల అక్రమాలపై అందే ఫిర్యాదులను అధిక ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి. శ్రీనివాసరావు, ఎస్ఈ డి. శ్రీనివాస్, సిటీ ప్లానర్ మదుకుమార్, సిఎంవో హెచ్ విజయలక్ష్మి, ఎం హెచ్ వో డాక్టర్ హనుమంతరావు, ఆర్ఓలు, ఈఈ లు, ఎస్ఎస్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com