వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయుడు ఆకర్ష రెడ్డి బియ్యపు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.