పెద్ద నోట్ల రద్దు కారణంగా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ‘స్వచ్ఛభారత్’, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి చర్యలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు. చండీగఢ్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు వేగంగా తగ్గుముఖం పట్టాయన్నారు. అంతేకాకుండా వారికి అందుతున్న నిధులు సైతం స్తంభించిపోయాయన్నారు. బర్కిల్లీ ఇండియా కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైట్లీ మాట్లాడారు. ‘ప్రస్తుతం అక్కడక్కడా ఉగ్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే నిజమేంటంటే సుమారు 5 నుంచి 10వేల మంది ఆందోళనకారులకు ఉగ్రసంస్థలు డబ్బులిచ్చి రాళ్లు రువ్వే కార్యక్రమాలను చేపడుతున్నాయి. గత 8-10 నెలల్లో అలాంటి ఘటనలు ఎందుకు జరగలేదు’ అని ప్రశ్నించారు.