న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఇ-కామర్స కంపెనీ స్నాప్డీల్ తమ వృద్ధిని కొనసాగించే క్రమంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే తమ సంస్థలో ఇ-కామర్స, లాజిస్టిక్స, పేమెంట్స ఆపరేషన్లలో సుమారు 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం తమ సంస్థ ప్రతినిధులు ఈ పనిలోనే ఉన్నారని స్నాప్డీల్ అధికారులు తెలిపారు. మరొక వైపు రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఇ-కామర్స కంపెనీగా తమ ప్రయాణం సాగుతుందని స్నాప్డీల్ ప్రకటించింది. తమ కంపెనీలో ఇప్పటి వరకు 8000 మంది ఉద్యోగులు ఉన్నారని, తమ సంస్థ లాభాలను కొనసాగించే నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పింది. తమ ప్రత్యర్థి కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట నుంచి స్నాప్డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఫ్రెష్ క్యాపిటల్ను ఆర్జించడానికి కూడా ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్నాప్డీల్ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు అధికమయ్యాయి. ప్రస్తుతం దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఇ-కామర్స కంపెనీగా తమ సంస్థను తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని స్నాప్డీల్ ప్రతినిధులు తెలియజేశారు.
ఫ్రీచార్జ సిఇఒ రాజీనామా
స్నాప్డీల్ ఉద్యోగుల తొలగింపు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఫ్రీచార్జ సిఇఒ గోవిందరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్నాప్డీల్ ధ్రువీకరించింది. ఫ్రీచార్జ వృద్ధిలో గోవిందరాజన్ విశేష కృషి చేశారని, ఇక ముందు ఆయన ఎంచుకునే ఇతర బాధ్యతల్లో అదే స్ఫూర్తి కనబరుస్తారని స్నాప్డీల్ సిఇఒ కునాల్ బహల్ పేర్కొన్నారు. 2015లో ఫ్రీచార్జను స్నాప్డీల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఆగస్టులో ఫ్రీచార్జలో సిఒఒగా తన కెరీర్ను ప్రారంభించిన గోవిందరాజన్ గత మేలో సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. గోవిందరాజన్ తరువాత జాసన్ కొఠారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.