చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఈ రోజు భారీ కూంబింగ్ నిర్వహించారు. టాస్క్ఫోర్స్ ఆర్ఎస్సై భాస్కర్ తన బృందంతో కలిసి శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పరిధిలోగల పుల్లయ్యగారి పల్లెగుట్ట వద్ద 10 మంది తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను పక్కన పెట్టి నిద్రపోతుండగా టాస్క్ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టింది. దీంతో కూలీలు చేతికందిన రాళ్లు తీసుకొని టాస్క్ఫోర్స్ బృందంపై దాడి చేస్తూ పారిపోయారు. వారిలో ఒకరిని టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకుంది.