చిత్తూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు. బి. కొత్తకోటకు చెందిన హార్థిక మదనపల్లి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివేది. రెండు నెలల క్రితం బడికాయలపల్లెకు చెందిన శ్రీనివాసులును ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు వారిని విడదీసి మళ్లీ కళాశాలకు పంపారు. కళాశాలకు సెలవులు రావడంతో ఇంటి దగ్గరే ఉంటోంది. రోజూ ఆమె తండ్రి ద్విచక్రవాహనం నేర్పించేవాడు. ఆదివారం ద్విచక్రవాహనం నేర్చుకునే క్రమంలో ఆమె ఒంటరిగానే వెళ్లిపోయింది. ఆమె ఎంతకీ రాకపో వడంతో తండ్రి ఆమె వెళ్లిదారిలోనే వెళ్లి గాలించాడు. క్రిష్ణాపురం రోడ్డు దగ్గర వాహనాన్ని గుర్తించాడు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో ఇంటి కొచ్చేశాడు. సోమవారం క్రిష్ణాపురం రోడ్డు దగ్గర పొలాల్లో మృతిచెంది పడి ఉన్న యువతి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. ఎస్ఐ మధురామచంద్రుడు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.