ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు బాగా చదివి ఉన్నతమైన స్థానాలలో వుండాలి: ఎమ్మెల్యే పద్మావతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 01:47 PM

అనంతపురం: శింగనమల నియోజకవర్గ విద్యార్థులు బాగా చదివి ఉన్నతమైన స్థానాలకు ఏదగాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలియజేసారు. రెసిడెన్షియల్ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని, బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లోకి రావాలి, మీ కుటుంబాలన్నీ బాగుండాలి. ఇదే మన ముఖ్యమంత్రి జగనన్న కోరిక అని ఎమ్మల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకుంటే మన అభివృద్ధే కాదు దేశాభివృద్ధికి తోడ్పడవచ్చునని అన్నారు.


ఉదాహరణకి మన దగ్గరున్న పంటని, మనం మార్కెట్ చేసుకోలేకపోతున్నాం, అందుకు భాషా సమస్య ఉంది, అదే చదువుకుంటే దానిని అధిగమించవచ్చునని అన్నారు. అందుకనే మన ముఖ్యమంత్రి జగనన్న విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపంలో ఖర్చు చేసి, ఉచితంగా చదువు చెబుతున్నారని అన్నారు. ఒకప్పుడు అమ్మఒడి అంటే అందరూ హేళన చేశారు, కానీ ఈరోజున చదువుకునే పిల్లల సంఖ్య బడుల్లో పెరిగిందని, తల్లిదండ్రులు తమ పిల్లలని పనిలోకి పంపించకుండా బడిలోకి పంపుతున్నారని అన్నారు. ఇప్పుడీ పథకాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని, ముఖ్యంగా అమ్మాయిలు చదువుకునేలా ప్రోత్సహించాలని చూస్తున్నారని అన్నారు.


ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయంబర్స్ మెంట్ పెట్టినప్పుడు చదివిన విద్యార్థులు నేడు దేశవిదేశాల్లో ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారని, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని వివరించారు. అదే విధానాన్ని నేడు జగనన్న అమలు చేస్తున్నారని అన్నారు. ఇక ఇంగ్లీషు మీడియం ఎందుకు తెలుగు చచ్చిపోతుందని తెలుగుదేశం వాళ్లు అన్నారు. బ్రిటీష్ వాళ్లు వందేళ్లు పరిపాలించారు. అప్పుడే మన భాష చచ్చిపోలేదని తెలిపారు.


ఇక జగనన్న గోరుముద్ద పథకానికి వస్తే ఎంత చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నారంటే, నిజంగా జగనన్న పరిపాలనలో చదువుకుంటున్న పిల్లలది స్వర్ణయుగమనే చెప్పాలి. విద్యార్థుల కోసం, విద్య కోసం మీ జగన్ మామయ్య ఎంతో చేస్తున్నారు. మరి ఆయన కోరుకునేది ఒకటే మీరు బాగా చదువుకోవడం ఒక్కటే అని పిల్లలని ఉద్దేశించి పేర్కొన్నారు. ఒక్క 11ఏళ్లు కష్టపడి చదవండి. జీవితాంతం హాయిగా ఉండమని స్టడీ టెక్నిక్స్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్నమ్మ, చైర్మన్లు, ఎంపీపీ, జెడ్ పి టి సి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైయస్సార్ సీపీ ముఖ్యనాయకులు మరియు ఉన్నత అధికారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com