భర్తకు బ్యాంకు లో ఉద్యోగం. జీవితం ఎంతో హాయిగా ఉంటుందని అత్తారింటికి వచ్చిన ఆ మహిళ జీవితం ఊహించని మలుపు తీసుకుంది. అప్పటి వరకు భర్త, పిల్లలతో హాయిగా సాగిన కాపురంలో ఏం జరిగిందో ఏమో కానీ భార్య తీసుకున్న డేంజర్ డిసిషన్ తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణం నేసేపేటకు చెందిన వెంకటకృష్ణకు కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె సుజనకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వెంకటకృష్ణ తాడిమర్రి ఎస్బీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నాయి. ఏమైందో ఏమో కానీ శనివారం రాత్రి సుజన ఇంట్లోని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. తలుపులు మూసి ఉండటంతో కుటుంబ సభ్యులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
కాగా సుజన మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలను సుజన తల్లిదండ్రులు అందజేశారు. అదనపు కట్న కోసం హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వెంకటకృష్ణ కుటుంబసభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.