రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం హిందూ మతాన్ని కించపరుస్తూ తెనాలి లోని 102 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాన్ని తొలిగించాలని ప్రయత్నం చేస్తుంది అంటూ కొంత మంది బీజేపీ నాయకులూ మాట్లాడుతుండగా దానికి బదులుగా, బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్పై బురద చల్లాలని చూస్తే సహించేది లేదు అంటూ మేకతోటి సుచరిత ఘాటుగా స్పందించారు.