కృష్ణా జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూలపాడు రెండు వర్గాల మధ్య వివాదం లో పోలీసులు చాక చక్యంగా వ్యవహరించారు. ఒక స్థలం కోసం జరిగిన వివాదం చిలికి చిలికి ఘర్షణకు దారితీసింది. అంతేకాకుండా దాడులకు ప్రేరేపించే దిశగా వాగ్వివివాదం చోటు చేసుకుంది అదే కనుక జరిగి ఉంటే లా ఆర్డర్ అదుపు తప్పేది. అల జరగకుండా తక్షణమే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అంతక ముందు ఇద్దరు పోలీసులు వుండగానే రెచ్చిపోయిన ఇరు వర్గాల వారు పోలీసుల ఎదుటే దాడులకు దిగారు. ఘర్షణ లో మహిళలు ఎక్కువ ఉండటం తో ఆ ఇద్దరు కానిస్టేబుల్ అదుపు చేయడం కష్ట తరంగ మారింది. ఇంతలో అక్కడికి డేరింగ్ ఎంట్రీ ఇచ్చిన "" లేడీ సింగం "" మహిళా ఎస్సై మణి విశ్వ రూపం చూపించారు. ఘర్షణకు పాల్పడుతున్న మహిళలను అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇరు వర్గాల ఘర్షణ సద్దుమనగడం తో మూలపాడు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.