గుంటూరు: మా పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వయ్యకళ్ళు గ్రామానికి చెందిన ఇద్దరు వృద్దులు శావల్యాపురం తహశీల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు. వయ్యకళ్ళు గ్రామానికి చెందిన కావూరి మల్లీశ్వరి, కావూరి సీతామహాలక్ష్మీ మాట్లాడుతూ గత అక్టోబర్ వరకు తమకు ఫించను వస్తుందని, జడ్పిటిసీ ఎన్నికల్లో వైసీపీ ఒడిపోవడంతో అప్పటినుండి తమకు పింఛన్ రాకుండా గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు సమగ్ర విచారణ చేసి తమకు పింఛను మంజూరు చేపించాలని కోరారు.