జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా గుంటూరు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో చిన్నారులతో కలిసి కేకును కట్ చేసి చిన్నారులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు జాతీయ బాలికల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. బాలికల్లో సామాజిక అవగాహన పెంచి పీడన నుంచి విముక్తి కలిగించేందు కేంద్ర ప్రభుత్వం 2008లో జనవరి 24ని జాతీయ బాలిక దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. స్త్రీ లేకపోతే సృష్టి లేదని అందువల్ల ఆడపిల్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారన్నారు. మహిళలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఎమ్మెల్యే శ్రీదేవి గుర్తు చేసుకున్నారు.