తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఆంక్షలు విధించింది. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకువస్తేనే దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ మరోసారి చెప్పింది. భక్తులు 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ చూపించాలని కోరింది. ఈ నిబంధనలు పాటించని భక్తులను అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేసి వెనక్కి పంపిస్తున్నామని టీటీడీ పేర్కొంది.