కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో హడలెత్తిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్వో డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అధనోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని పిడుగులాంటి వార్త చెప్పారు. ఒమిక్రానే చివరి వేరియంట్ అని, దీంతో మహమ్మారి అంతమవుతుందని భావించడం చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం క్రిటికల్ జంక్షన్ లో ఉందని, మానవాళి ముందు కొన్ని సవాళ్లున్నాయని అన్నారు. అన్ని దేశాలు కరోనా ముప్పు తీవ్రంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని హెచ్చరించారు. కోవిడ్ ను నివారించదగ్గ వ్యాధి అయినా వారానికి 50 వేల మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు.