క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతల తీరుని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కొడాలి నాని. చెత్తకాగితాలు తెచ్చి ఇవిగో ఆధారాలు అంటే ఎలా? మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం. కరోనా వచ్చి ఆస్పత్రిలో వుంటే నన్ను టార్గెట్ చేశారు. కే కన్వెన్షన్ లో కేసినో జరిగినట్టు నిరూపించాల్సిందే. టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో వున్నది ఎవరు? కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో నిందితులుగా వున్నవారు ఆ కమిటీలో వున్నారు. బోండా ఉమ పిచ్చిపిచ్చి వేషాలు వేయకు అంటూ కొడాలి నాని టీడీపీ నాయకులని హెచ్చరించారు.