ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాగ్రత్త రెడ్ బుక్ ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 11:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP)లో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని, చట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని, చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌కు రెడ్ బుక్‌లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. యాక్షన్ అయితే అనివార్యమని, వైసీపీ  వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదని.. కానీ తన నుంచీ ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందన్నారు. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని, పరిపాలన ఒకే దగ్గర ఉంది. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని, బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వరదలొస్తే జగన్‌లా పరదాలు కట్టుకునట్లు.. సీఎం చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదన్నారు. మాజీ సీఎం జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుందని ఎద్దేవా చేశారు. గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అన్నారని, ఇప్పుడు టీసీఎస్ గురించి ఏ ఆత్మతో మాట్లాడారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నామని.. ఇందుకు లూలూ, అశోక్ లైల్యాండ్ లే ఉదాహరణ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్‌ ఇటీవల ముంబైలో టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఇంకోవైపు.. హీరానందానీ సంస్థల డైరెక్టర్‌ హర్ష్‌ హీరానందానీతో సమావేశం అయినట్లు నారా లోకేశ్ ప్రకటించారు. రాయలసీమలో ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు, విశాఖలో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌లకు ఉన్న అవకాశాలపై చర్చించానని లోకేశ్‌ పేర్కొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com