ఏపీలో పీఆర్సీ పీటముడి వీడటం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానించింది. హైకోర్టు తీర్పు, ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ఇప్పటికే విజయవాడలో భేటీ అయింది. మంత్రులను కలిసి పీఆర్సీ జీవోలకు వ్యతిరేకమని చెప్పే యోచనలో ఈ కమిటీ ఉండగా, ఉద్యోగులు తగ్గుతారా లేక ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.