సోమవారం గుంటూరు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే శ్రీదేవి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి నియోకవర్గంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా అధికారులు మంచి నీటి సరఫరాకు సంబంధించి నివేదికలను ఎమ్మెల్యే శ్రీదేవికి అందజేశారు. జల్జీవన్ మిషన్ కింద నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు రూ. 16 కోట్లకు సంబంధించిన పనులకు త్వరలో టెండర్లు పిలుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే గ్రామ సచివాలయాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కోరకు రూ. కోటి రూపాయల టెండర్లను పిలిచినట్లు తెలిపారు.
రాబోయే వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీరు ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీదేవి సూచించారు. నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో తాగునీటికి సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం లేకుండా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ కే. రాంబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.