ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల వినియోగదారులకు ఝలక్ ఇస్తున్నాయి. ఎల్ పీజీ సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ. 1000, అదే కమర్షియల్ సిలిండర్ కు రూ.2200 చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం గ్యాస్ సిలిండర్ బరువును తగ్గించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు సిలిండర్ ట్రాన్స్ పోర్టేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందువల్ల సిలిండర్ బరువును తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించారు.