చిత్తూరు: కాజ్ వే నీటి ఉధృతికి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. ఈ వాహనంపై ఉండిన ముగ్గురు యువకులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం పరదరమి కి చెందిన 24 ఏళ్ల యువకుడు చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. తనతో పాటు పనిచేసి ఇద్దరు మిత్రులతో కలిసి గురువారం సాయంత్రం తవణంపల్లి మండలం లోని దిగువ మాగానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యం లోని మత్యం కాజ్ వే పైకి వచ్చేసరికి నీటి ఉధృతికి వీరు ద్విచక్రవాహనం తోపాటు కొట్టుకుపోయారు. వంకలో కొంతదూరం కొట్టుకెళ్ళిన యువకులు ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ద్విచక్ర వాహనం మాత్రం స్థానికులతో కలిసి వెతికినా కనిపించడం లేదు. దాంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.