బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడనుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వేగంగా గాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి ఒడిశా వైపు వెళ్లనుంది. మూడు గంటల వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ చినుకులు మొదలౌతాయి. కోస్తా ప్రాంతంలో ప్రభావం మొదలు కానుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.