ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిడ్డను కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన తల్లి

national |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 12:31 PM

'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు' అనే మాట మరోసారి రుజువైంది. మధ్యప్రదేశ్‌ లో ఓ తల్లి చిరుతతో పోరాడి తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ఆ మహిళ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ ఘటన సిద్ధి జిల్లా బరిజహారియా గ్రామంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. బైగా తెగకు చెందిన కిరణ్‌ అనే మహిళ ఆదివారం సాయంత్రం తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది. ఓ బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఓ చిరుత అకస్మాత్తుగా ఓ పిల్లాడిని నోట కరచుకుని అడవిలోకి పరుగులు తీసింది. వెంటనే కిరణ్‌ ఆ చిరుతను వెంబడించింది. కిలోమీటరు దూరంలో చిరుతను గుర్తించి పోరాడింది. ఎంతో కష్టపడి తన కుమారుడిని రక్షించుకుంది. తల్లిబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా గ్రామస్థులు వచ్చి దానిని తరిమేశారు. గాయపడిన తల్లిబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com