మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ...ఆ పార్టీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ను కోరారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్ లు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ కార్యాలయంపై అక్టోబర్ 19న దాడి జరిగినా.ఇంత వరకు FIR నమోదు చేయలేదన్నారు