పంచకుల : అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా చీఫ్ ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం గుర్మీత్ రామ్ రహీం ను హెలికాప్టర్ లో రోహతక్ జైలుకు తరలించారు. తీర్పు వెలువడిన తరువాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో గుర్మీత్ అనుచరులు సృష్టించిన విధ్వంసకాండలో 39 మంది మరణించగా, భారీగా ఆస్తుల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే.