న్యూఢిల్లి : అత్యాచారం కేసులో కోర్టు దోషిగా నిర్ధారించిన డేరా సచ్చా సౌదా అధినేత, ఆధ్యాత్మికవేత్త గుర్మీత్ రామ్ రహీం తొలి రోజు జైలులో మౌనంగా గడిపారు. సిబిఐ కోర్టు గుర్మీత్ను దోషిగా ప్రకటించిన అనంతరం అతడిని రోహతక్ జైలులోని ప్రత్యేక సెల్లోకి మార్చారు. గుర్మీత్ జైలుకు రాగానే అధికారులు అతడికి నీళ్ల బాటిల్ అందజేశారు. గుర్మీత్ ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. గుర్మీత్ సహాయకుడిని కూడా అతడితో ఉండటానికి అధికారులు అనుమతించారు. భద్రతా కారణాల రీత్యా ఇతర ఖైదీలతో ఉండటానికి గుర్మీత్ ఇష్టపడకపోవడంతో అతడికి ప్రత్యేక సెల్ను కేటాయించారు.