న్యూఢిల్లీ: లోక్సభ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్సభ చేపట్టిన కార్యక్రమాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటన చేశారు. వివిధ అంశాలపై మంత్రులకు 41 ప్రకటనలు చేసినట్లు ఆమె తెలిపారు. మొత్తం 1217 నివేదికలను ప్రవేశపెట్టారు. ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు, ఓ తీర్మానంపై చర్చ జరిగిందన్నారు. జీరో అవర్లో మొత్తం 252 నోటీసులు జారీ అయ్యాయన్నారు. సభా సమయంలో చర్చలు చేపట్టాలని 42 అభ్యర్థనలు వచ్చినట్లు స్పీకర్ మహాజన్ తెలిపారు. వాయిదా తీర్మానాల వల్ల సభ మొత్తం 30 గంటల సమయాన్ని కోల్పోయినట్లు చెప్పారు. కానీ ఎంపీలు దాదాపు 57 గంటల పాటు మాట్లాడినట్లు ఆమె తెలిపారు.