గత వారం రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్నవర్షాలు కొండ ప్రాంతాల ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. సిమ్లా ప్రాంతంలోని పలు గ్రామాల్లో వర్షాల ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. చాలా ఇళ్లు ప్రమాద అంచున ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశముండటంతో అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావంపై సీఎం వీరభద్ర సింగ్ సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో కొండ ప్రాంతాలు భారీగా నష్టపోతున్నాయని, ఇందుకోసం శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.