గుంటూరు లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ట్లు వచ్చిన పక్క సమాచారం తో ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి దాదాపు ఐదు లక్షల రూపాయల విలువగల ఏలక్ట్రానికి వస్తువులను స్వాదినం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు . పక్క సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు గోరంట్లలోని ఓక అపార్ట్ మెంట్ లో అద్దెకు వుంటూ క్రికెట్ బెటింగ్లకు పాల్పడుతున్న బలుసపాటి వేణుబాబు, భత్తుల వీరయ్య, పిల్లి నాగేశ్వరరావులను రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు . గుంటూరు నగరంలోని మరో ప్రాంతంలో కూడ పోలీసులు దాడులు చేసారు. కోత్తపేట లోని ఓక ఇంటిని అద్దెకు తీసుకుని క్రికెట్బెట్టింగ్ కు పాల్పుడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. మాదినేని బాలాజి, చిరంజీవి లను అరెస్టు చేసారు. ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు, ఏస్ ఐలకు ప్రత్యేక అబినందలతో పాటు ప్రశంశా ప్తత్రాలను ఏస్ పి అందచేసారు.