మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ మఖ్ పై ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇక ఇవాళ సీబీఐ ఏక కాలంలో మంబయి, నాగ్ పూర్ తనిఖీలు నిర్వహిస్తుండగా అందులో అనిల్ దేశ్ ముఖ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నెలకు వంద కోట్లు వసూలు చేయాలని ఒత్తిడి తెచ్చారన్న మాజీ కమిషనర్ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.